Thursday 30 April 2020

రెండేళ్లలో మీరేంటో తెలుసుకున్నా.. లవ్‌ యూ రిషి అంకుల్: ఆలియా భట్ ఎమోషనల్ మెసేజ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ మృతిని నటి ఆలియా భట్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ చాలా భాదపడుతున్నారు. రిషి కపూర్ బుధవారం హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబంతోనే ఉన్న ఆలియా.. గురువారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. రిషి కపూర్ తనయుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఆలియా భట్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నానున్నారు. రణ్‌బీర్ ప్రేయసిగా కపూర్ ఫ్యామిలీకి పరిచయమైన ఆలియా.. ఆ తరవాత రిషి కపూర్‌కి బాగా దగ్గరయ్యారు. గడిచిన రెండేళ్లలో రిషి కపూర్ అంటే ఏంటో తెలుసుకున్నానని అన్నారు ఆలియా. ఈ మేరకు రిషి కపూర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ మెసేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Also Read: ‘‘నా జీవితంలోకి బోలెడంత ప్రేమను, ఆనందాన్ని తీసుకొచ్చిన ఈ అందమైన మనిషి గురించి నేను ఏం చెప్పగలను. రిషి కపూర్ అనే దిగ్గజం ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నా కూడా ఆయన తెలుసు. నా గురించి నాకు ఎంత తెలుసో ఆయన గురించి కూడా అంత తెలుసు. గచిడిన రెండు సంవత్సరాల్లో ఆయన నాకు ఒక స్నేహితుడిగా, తోటి చైనీస్ ఫుడ్ లవర్‌గా, సినిమా ప్రేమికుడిగా, పోరాట యోధుడిగా, నాయకుడిగా, గొప్ప కథకుడిగా, ఒక ఉద్వేగభరితమైన ట్వీటర్‌గా, ఒక తండ్రిగా తెలుసు. ఈ రెండేళ్లలో ఆయన నుంచి నేను పొందిన ప్రేమ, ఆత్మీయ ఆలింగనాన్ని ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ విశ్వం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఈరోజు మనలో చాలా మంది ఆయన తమ కుటుంబ సభ్యుడు అని చెబుతారు. ఎందుకంటే ఆయన వల్ల పొందిన ఆనందం అలాంటిది. లవ్ యూ రిషి అంకుల్. మీరు లేని లోటు తీరనిది. మీతోపాటు ఉండే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని తన మెసేజ్‌లో ఆలియా పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VOgZcQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...