Wednesday 29 April 2020

సినీ ఇండస్ట్రీలో విషాదం.. బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మృతి

బాలీవుడ్‌లో వరుస మరణాలు చోటు చేసుకోవడం సినీ వర్గాలను షాకింగ్‌కి గురిచేస్తోంది. నిన్న (బుధవారం) ఇర్ఫాన్ ఖాన్ మరణించగా.. కొద్దిసేపటి క్రితం ఈ రోజు (గురువారం) సీనియర్ నటుడు, రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ (67) మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1952 వ సంవత్సరం సెప్టెంబర్ 4న జన్మించిన రిషికపూర్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ని పెళ్లాడాడు. రిషికపూర్ కుమారుడే ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. రీసెంట్ గా ది బాడీ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు రిషి కపూర్. 2018లోనే రిషి కపూర్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన న్యూయార్క్‌ నగరంలో చికిత్స తీసుకొని ఇండియా వచ్చారు. ఇటీవలే ఆయన యోగా చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రిషి భార్య నీతూ సింగ్. ఇంతలోనే ఆయన మరణించారనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో నెట్టేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yfd3n7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...