ప్రముఖ బాలీవుడు నటుడు ఇర్ఫాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్ 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని 2019 సెప్టెంబర్లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారు. నిన్నటి నుంచి ఇర్ఫాన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించి మృతిచెందినట్టు ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. కాగా, ఇర్ఫాన్ మృతిపట్ల బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇర్ఫాన్ మృతిని ఖరారు చేస్తూ దర్శకుడు సుజిత్ సర్కార్ మొదటిగా ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zAsUSM
v
No comments:
Post a Comment