కరోనా వైరస్ నివారణలో భాగంగా షూటింగ్స్ అన్నీ నిలిపివేసి ఇంటికే పరిమితమైన సినీ తారలు సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. యంగ్ హీరోహీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ హోమ్ క్వారంటైన్ విశేషాలు చెబుతూ అందరినీ పలకరిస్తుంటే.. సీనియర్ హీరోలైన చిరంజీవి, తమ తమ మానవరాళ్లతో కలిసి వీడియోలు చేస్తూ లాక్డౌన్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ఛాలెంజ్ల హవా నడుస్తోంది. ఇప్పటికే 'బీ ది రియల్ మెన్' అంటూ స్టార్ హీరోలు, దర్శకులు తమ తమ వీడియోలతో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన మనవారిని పక్కనే కుర్చోబెట్టుకొని వంట గదిలో రుచికరమైన వంటలు చేస్తూ మరో ఛాలెంజ్ పరిచయం చేశారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ తనకు ‘వంట సవాల్’ విసిరిందని చెబుతూ తాను స్వయంగా శనిగపప్పు మసాలా వడలు చేస్తున్న తాలూకు వీడియో షేర్ చేశారు. తాను చేసిన ఆ వడలను మనవరాలు విద్య నిర్వాణకు చూపించి నేను టేస్ట్ చేయాలా? నువ్వు టేస్ట్ చేస్తావా? అని అడిగిన మోహన్ బాబు.. చివరకు ఆయనే నోట్లో వేసుకొని ఆహా ఏమి రుచి అన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలాఉంటే మరోవైపు తన మనవరాలు నవిష్కతో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలోని 'మిమ్మీ మిమ్మిమ్మీ' వీడియో సాంగ్ ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ రెండు వీడియోలు చూసి తాతల సరదా భలే ఉందే! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2y5IR34
v
No comments:
Post a Comment