Monday 28 June 2021

చాలా బాధగా ఉంది.. ఏదో ఒక రోజు తప్పకుండా అతన్ని కలుస్తా.. రష్మిక మందన కామెంట్స్ వైరల్

'ఛలో' అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన .. ఆ తర్వాత ''గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, బీష్మ'' సినిమాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో క్రేజీ బ్యూటీగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ రెమ్మ్యూనరేషన్ కూడా భారీ గానే పుచ్చుకుంటోంది. మరోవైపు తన క్యూట్ లుక్స్‌తో భారీ ఫాన్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ. నేషనల్‌ క్రష్‌గా ప్రతి ఒక్కరి గుండెల్లో పర్మినెంట్‌గా గూడు కట్టుకుంది. అయితే రష్మిక మందనపై ఉన్న అభిమానంతో ఆమెకు చూడడానికి ఇటీవల ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని గూగుల్‌‌లో వెతికిమరీ తెలుసుకొని ఆమె స్వస్థలానికి చేరుకున్నాడు సదరు అభిమాని. రష్మిక ఇంటికి కూడా వెళ్ళాడు కానీ ఆ సమయంలో రష్మిక అక్కడ లేకపోవడంతో అతను తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకొని ట్విట్టర్ వేదికగా రష్మిక స్పందించింది. ఓ అభిమాని తనను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటక లోని మా ఇంటి వరకూ వచ్చాడని తెలిసిందని పేర్కొంటూ దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది. అయితే ఆ అభిమానిని కలవలేకపోయినందుకు చాలా బాధగా ఉందని, ఏదో ఒకరోజు తప్పకుండా అతన్ని కలుస్తాననే నమ్మకం ఉందని ఆమె తెలిపింది. రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్‌లో మరో రెండు మూవీస్ చేస్తోంది రష్మిక మందన.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3djDIG8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...