Tuesday 29 June 2021

భూ వివాదంలో టాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్.. సి కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు

టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత సి కళ్యాణ్‌పై నమోదైంది. భూ వివాదంలో ఆయన చిక్కుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. షేక్‌పేట భూవివాదంపై వచ్చిన ఫిర్యాదు పరిశీలించి సి కళ్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్న స్వ‌రూప్ అనే వ్య‌క్తి 1985 సంవత్సరంలో షేక్‌పేటలో ఫిలింన‌గ‌ర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. ఈ స్థ‌లాన్ని 2015 సంవత్సరంలో నారాయణ మూర్తి అనే వ్య‌క్తికి లీజుకు ఇచ్చాడు. లీజుకు తీసుకున్న ఆ స్థలంలో అప్ప‌టి నుంచి నారాయణ మూర్తి ఓ ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. అయితే సోమ‌వారం సాయంత్రం సమయంలో ష‌రూఫ్‌, శ్రీకాంత్‌, తేజ‌స్వీ అనే ముగ్గురు వ్య‌క్తులు సదరు ఆర్గానిక్ స్టోర్‌కు వెళ్లి నిర్మాత సి. క‌ళ్యాణ్ పంపించాడ‌ని చెప్పి.. స్టోర్‌కు తాళం వేయడంతో ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఆర్గానిక్ స్టోర్ య‌జ‌మాని సి. క‌ళ్యాణ్‌తో పాటు ఆ ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు క‌ళ్యాణ్‌తో పాటు ఆ ముగ్గురిపై కూడా కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y0yxmj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...