Monday 30 November 2020

Sukumar: ఈసారైనా లెక్క సరిచేస్తాడా?.. క్రేజీ కాంబోపై మహేశ్ ఫ్యాన్స్ ఆశలు

తెలుగు సినీ దర్శకుల్లో సుకుమార్‌ది ప్రత్యేక శైలి. లెక్కల మాస్టారి నుంచి డైరెక్టర్‌గా మారిన ఆయన విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తొలి సినిమా ‘ఆర్య’తోనే తానేంటో నిరూపించుకున్న ‘రంగస్థలం’తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఎదిగారు. అల్లు అర్జున్‌తో ఆర్య, ఆర్య2.. సినిమాలు తెరకెక్కించిన సుకుమార్ ‘పుష్ప’ పేరుతో పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు విజయాలు అందించిన సుకుమార్.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాత్రం నిరాశ కలిగించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘నేనొక్కడినే’ విమర్శకులను మెప్పించినా కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయింది. Also Read: అయితే రెండో ప్రయత్నంలో మహేశ్‌కు ఎలాగైనా హిట్ ఇవ్వాలన్న కసితో సుకుమార్ ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నాడట. దీనికి మహేశ్‌ కూడా ఓకే చెప్పేశాడని, ‘పుష్ప’ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే సుకుమార్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో తెరకెక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే మహేశ్, సుకుమార్ కాంబినేషన్లో కచ్చితంగా మరో సినిమా రావడం పక్కా అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KMteDw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...