Monday 30 August 2021

హైదరాబాద్ వీధుల్లో ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. నడి రోడ్డుపై ఆమెతో కలిసి రచ్చ రచ్చ

‘బాహుబలి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం ‘’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి కారణంగా రెండు సార్లు వాయిదాపడటం.. ఈ క్రమంలో సినిమా విడుదల కూడా వాయిపడటం అభిమానులను నిరాశపరిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగిన పూర్తి అయింది. ఒక రెండు పికప్ షాట్లు మినహా మిగితా సినిమా అంతా పూర్తి అయింది అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో చిత్ర నటీనటులు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌కు ఆమె జోడీగా కనపించనుంది. ఈ సినిమాలో ఆమె బ్రిటీష్ యువరాణి పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో ఓలివియా మోరిస్ హాయిగా హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. తన స్టైలిష్ట్ అను రెడ్డితో కలిసి ఆమె సరదాగా గడిపింది. హైటెక్ సిటీలో సరదాగా గడిపిన ఒలివియా ఆ తర్వాత దహి పూరి ని కూడా టేస్ట్ చేసింది. రోడ్డు సైడ్ ఫుడ్ తో పాటు కొంత షాపింగ్ కూడా చేసింది ఈ ఇంగ్లీష్ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mGwbGN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...