వాడకం పెరిగిపోయిన తర్వాత ఎన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయో.. అన్ని నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సోషల్మీడియా వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సోషల్మీడియా ద్వారా వేధించడం.. ఫేక్ ఫోటోలు సృష్టించడం.. వంటి ఎన్నో దరిద్రపు అనుభవాలను ఎదురుకుంటున్నారు అమ్మాయిలు. తాజాగా ఓ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాను డైరెక్టర్ని అంటూ నటి పాయల్ సర్కార్కు అసభ్య మెసెజ్లు పంపించాడు ఓ వ్యక్తి. బెంగాల్లో పుట్టిన డజనుకుపైగా సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లోనే కాక.. రాజకీయాల్లోనే ఆమె తన సత్తా చాటింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. ఇక దీంతో పాటు ఆమె పలు టీవీషోలలో కూడా ఆమె ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అయితే తాజాగా ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తాను అంటూ.. తాను సీనియర్ దర్శకుడిని అంటూ ఓ వ్యక్తి ఆమెని దారుణంగా మోసం చేశాడు. అంతేకాక.. ఆమె అసభ్యంగా సందేశాలు పంపించాడు. దీంతో ఆమె వెంటనే ముందడుగు వేసింది. ఆ మెసేజ్లను స్క్రీన్షాట్ తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అతను రవి కినాగి అంటూ ఫోటోలు కనిపించాయి. అంతేకాకుండా అతను తీసిన సినిమాలు కూడా దర్శనమిచ్చాయి. దీంతో ఆమె.. అతను నిజంగానే దర్శకుడు అని భ్రమపడింది. కానీ, ఆ తర్వాత అతను అసభ్యంగా మెసేజ్లు పంపించడంతో అతని నిజస్వరూపం బయటపడింది. ఒక రాత్ర గడపాలి అంటూ అతను ఆమెకు సందేశాలు పంపించడం ప్రారంభించాడు. దీంతో ఆమె ఆ మెసేజ్లు అన్ని స్క్రీన్షాట్స్ తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె తన సన్నిహితుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. బరక్పూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kS1tIn
v
No comments:
Post a Comment