Thursday 30 September 2021

‘‘రిపబ్లిక్’ సినిమా చూశాను.. ఆ ప్రార్థనల ఫలితమే తిరిగొచ్చింది..’ హీరో నాని కామెంట్స్

హీరో హీరోగా దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘’. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సినిమా విడుదల వాయిదాపడుతుంది అని అంతా భావించారు. సాయి ధరమ్ పూర్తిగా కోలుకొనే వరకూ సినిమాను విడుదల చేయరు అని అంతా అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ.. సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయి సాయి ధరమ్ తేజ్‌కు తమ మద్దతు తెలిపారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా ఈ సినిమాకు తన మద్దతు ఇచ్చారు. నాచురల్ స్టార్ ఈ సినిమాను ప్రత్యేక షో ద్వారా వీక్షించారు. అనంతరం ఆయన సినిమా గురించి ట్వీట్ చేశారు. ‘‘రిపబ్లిక్’ సినిమా చూశాను. సాయి ధరమ్ తేజ్ తన చుట్టు ఉన్నవారిపై ఎంత దయ చూపించేవాడో.. దాని వల్ల ఆయన గురించి చేసిన ప్రార్థనల ఫలితం మొత్తం ఈ సినిమా ద్వారా తిరిగి వచ్చింది. దేవ కట్టా ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కమ్‌బ్యాక్ ఈ సినిమా. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు’ అంటూ నాని ట్వీట్ చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నారు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. ఆయన్ని రెండు రోజుల్లో కలుస్తాను అంటూ ఆయన పేర్కొనడంతో.. అభిమానులకు ఎంతో ఊరట లభించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3olj7r3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...