Wednesday 29 September 2021

మరో మల్టీస్టారర్ మూవీకి రానా గ్రీన్ సిగ్నల్.. ఈ సారి శర్వాతో జోడీ! మైత్రీ మేకర్స్ పక్కా ప్లాన్

నేటితరం ప్రేక్షకులు మల్టీస్టారర్ మూవీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇద్దరు స్టార్లను ఒకే తారను పంచుకోవడం ఇష్టపడుతున్నారు. ఇలాంటి సినిమాలకే భారీ ఆదరణ లభిస్తుండటంతో దర్శకనిర్మాతలు సైతం మల్టీస్టారర్ మూవీలపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా RRR, పవన్ కళ్యాణ్, ప్రధాన పాత్రల్లో 'భీమ్లా నాయక్' సినిమాలు భారీ రేంజ్‌లో రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారట. యంగ్ అండ్ టాలెంటెడ్ రానా దగ్గుబాటితో పాటు మరో యంగ్ హీరో కలయికలో ఈ మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ హంగులతో ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను ప్రారంభించి అతి త్వరలో ఫినిష్ చేయాలనేది ప్లాన్. ఈ మేరకు ఇప్పటికే రానా, శర్వాలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిత్ర దర్శకుడు, ఇతర వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఇకపోతే ఎలాంటి కథలోనైనా తన రోల్ స్పెషల్ అనిపించుకుంటూ విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న దగ్గుబాటి రానా.. తన బాబాయ్ వెంకటేష్‌తో కలిసి మరో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ‘రానా నాయుడు’ అనే పేరుతో ఈ మూవీ రూపొందనుందని ఇటీవలే అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషిస్తున్నారు రానా. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాకే రానా, శర్వా మూవీ సెట్స్ మీదకొస్తుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZxYLjZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...