Monday 14 March 2022

ఓటీటీలోకి ‘రాధే శ్యామ్’ వచ్చేది ఎప్పుడంటే... రూల్ బ్రేక్ చేస్తారా!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ ‘’. మూడు వందల కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న విడుదలైంది. మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకుంది. సినిమా థియేట‌ర్స్‌లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌కుంటోంది. కాగా.. తాజాగా ‘రాధే శ్యామ్’ ఓటీటీ రిలీజ్ డేట్ గురించిన వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. క‌రోనా త‌ర్వాత సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేసే డేట్స్ విష‌యంలో మ‌న నిర్మాత‌లు కాస్త రూల్స్‌ను మార్చుకున్నారు. ఒక‌ప్పుడు సినిమా విడుద‌లైన మూడు నెల‌ల త‌ర్వాత కానీ.. ఓటీటీల్లో దాన్ని ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని రూల్స్ పెట్టుకుని మ‌రీ ఓటీటీ డీల్స్ కుదుర్చుకునే వారు. కానీ పాండమిక్ త‌ర్వాత ప‌రిస్తితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాల త‌ర్వాత ఎప్పుడైనా ఓటీటీల్లో ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చు. ఆ కోవ‌లో చూస్తే ‘రాధే శ్యామ్’ సినిమాను ఏప్రిల్ 11 లేదా ఆ త‌ర్వాత కానీ ఓటీటీలో విడుద‌ల చేసుకోవ‌చ్చు. కానీ.. అలా కాకుండా ముందుగానే ఓటీటీలో ప్ర‌సారం చేస్తే ఎలా ఉంటుంద‌ని ఓటీటీ ప్ర‌తినిధులు ఆలోచిస్తున్న‌ట్లు టాక్‌. దీని ప్ర‌కారం ఏప్రిల్ 2న ఉగాది ఉంది. అదే రోజున విడుద‌ల చేస్తే బావుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అమెజాన్ ప్రైమ్ ..‘రాధే శ్యామ్’ ఓటీటీ హ‌క్కుల‌ను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసుకుంది. త్వ‌ర‌లోనే ‘రాధే శ్యామ్’ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జోడీగా న‌టించిన ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. పీరియాడిక్ ల‌వ్ స్టోరిగా సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/594w3AT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...