Tuesday, 24 August 2021

బచ్చన్ ఫ్యామిలీలో విషాదం.. ఆస్పత్రికి వచ్చిన అమితాబ్.. ఐశ్వర్య మాత్రం ఆలస్యంగా..

ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటుడు ఆయన.. తన నటనతో బాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్‌ను క్రియేట్ చేశారు. విలక్షణమైన నటనకి, విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆయన కేరాఫ్ అడ్రెస్. ఆయనే బాలీవుడ్ షెహన్‌షా.. బిగ్ బీ . ఆయన చేసిన సినిమాలు అన్ని దాదాపు బ్లాక్‌బస్టర్లే. ఎంత వయస్సు వచ్చినా ఆయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. ఇక ఆయన ఫ్యామిలీలోని అందరు నటులే. ఆయన భార్య , కుమారుడు , కోడలు బచ్చన్.. అందరికీ సుపరిచితులే. ప్రస్తుతం భారత సినిమా ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలీ ఎవరు అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది బచ్చన్ ఫ్యామిలీనే. అంతలా సినిమా ఇండస్ట్రీపై ప్రభావం చూపించింది ఈ కుటుంబం. అయితే తాజాగా ఈ ఫ్యామిలీలో అనుకోకుండా ఓ విషాదం చోటు చేసుకుంది. అదేంటంటే.. బిగ్ బీ కుమారుడు అభిషేక్ తాజాగా ప్రమాదానికి గురయ్యారు. కొన్ని రోజుల కిందట ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి గాయమైంది. తాజాగా ఆ గాయం మరోసారి తిరగబడటంతో ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్త తెలిసి అమితాబ్.. తన కుమార్తె శ్వేతా బచ్చన్‌తో కలిసి లీలావతి ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఐశ్వర్య మాత్రం వార్త తెలిసిన వెంటనే తన భర్తను చూసేందుకు రాలేకపోయింది. అందుకూ ఓ కారణం ఉంది. ఆమె ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియన్ సెల్వం’ అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండటం కారణంగానే ఐశ్వర్య ఆలస్యంగా ఆస్పత్రికి చేరుకుంది. ప్రస్తుతం అభిషేక్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ydWmqc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...