కష్టాల్లో ఉన్న మనిషికి సహాయం చేస్తే.. ఆ వ్యక్తిని దేవుడిలా పూజిస్తారు. ఒకరికి సహాయం చేస్తేనే దేవుడంటే... వేలాది మందికి సహాయం చేస్తే ఆ వ్యక్తిని ఏమనాలి. ప్రస్తుతానికైతే సోనుసూద్ అని పిలవాలి. కరోనా కారణంగా ఏర్పడిన ఉపద్రవ పరిస్థితుల్లో సోనూ ఎందరికో ఆపద్భాందవుడిలా నిలిచాడు. వేలాది మంది వలసకార్మికులు, నిరుపేదలను స్వస్థలాలు తరలించాడు. ఉపాధి కోల్పోయిన ఎందరికో అతను అండగా నిలిచాడు. లాక్డౌన్ ముగిసి కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నాయని అంతా ఆనందించే లోపే రెండో దశలో మహమ్మారి దేశాన్ని మరింత దట్టంగా కమ్మేసింది. ఇక సెకండ్ వేవ్ సమయంలోనూ సోనూసూద్.. తన ఆపన్నహస్తాన్ని వెనక్కి తీసుకోలేదు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో.. ప్రజలు కష్టాలు ఎదురుకోవద్దనే ఉద్దేశంతో ఆయన స్వయంగా ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేశారు. అంతేకాక.. సోషల్మీడియా ద్వారా అవసరంలో ఉన్నవారి వివరాలు తెలుసుకుంటూ.. వారికి తగిన సహాయం అందిస్తున్నారు. చాలామంది అవసరంలో ఉన్నవాళ్లు సోనూసూద్ ఇంటి వద్దకు వెళ్లి.. ఆయనకు తమ అవసరాలు తెలియజేశారు. వారికి కూడా ఆయన తగిన సహాయం అందజేశారు సోనూ. అయితే తాజాగా ఆయనకు ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. 2022 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ముంబై మేయర్గా పోటీ చేస్తున్నారంటూ ఓ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. అయితే దీనిపై సోనూసూద్ తాజాగా స్పందించారు. ‘ఇది నిజం కాదు.. నేను సామాన్యుడిగానే సంతోషంగా ఉన్నాను ’ అంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా సోనూసూద్ను దేశానికి ప్రధాని చేయాలి అంటూ చాలా మంది అన్నారు. దీనిపై కూడా స్పందించిన సోనూ తనకు రాజకీయాలు అంటే ఇష్టం లేదని.. ఇలాగే ప్రజా సేవ చేయడమే తనకు ఇష్టం అని ఆయన పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sJuo4F
v
No comments:
Post a Comment