Monday, 20 July 2020

‘సీటీమార్’ తరవాత గోపీచంద్ సినిమా ఫిక్స్.. డైరెక్టర్ ఆయనే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ డ్రామాలను తెరకెక్కించే కొద్ది మంది దర్శకుల్లో మారుతి ఒకరు. ‘ఈ రోజుల్లో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మారుతి.. కిందటేడాది వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా వరకు డీసెంట్ హిట్స్ అందుకున్నారు. ‘కొత్త జంట’, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ సినిమాలు మారుతి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఎక్కడా కామెడీకి లోటు లేకుండా కథను నడిపించడంలో మారుతి దిట్ట. ‘ప్రతిరోజూ పండగే’ తరవాత మారుతి మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు. Also Read: ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న తాజా సమాచారం ప్రకారం మాచో హీరో గోపీచంద్‌‌ను ఇటీవల మారుతి కలిసి ఒక కథ చెప్పారు. ఈ కథ గోపీచంద్‌కు బాగా నచ్చేసిందని, ఆయన వెంటనే పచ్చజెండా ఊపేశారని టాక్. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుందని అంటున్నారు. ఆ ప్రముఖ సంస్థ జీఏ2 అని కొంత మంది మాట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివరలో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ సినిమా ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ప్రస్తుతం తన సినిమా ‘సీటీమార్’ విడుదల కోసం వేచి చూస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైంది. ఈ సినిమాలో తమన్నా, దిగంగన సూర్యవంశి, రెహమాన్, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్, జయప్రకాష్, ప్రీతి అస్రాని ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘గౌతమ్ నంద’ తరవాత గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fJbTGo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...