బాలీవుడ్లో బంధుప్రీతిపై విమర్శలు ఆగడం లేదు. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్లో నెపోటిజంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సల్మాన్ ఖాన్తో పాటు , ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలి వంటి పలువురిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖ హీరో గోవిందా బాలీవుడ్లో బంధుప్రీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం నలుగురైదుగురు చేతుల్లోనే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గోవిందా. బాలీవుడ్లో కొంతమంది వ్యక్తులు మాత్రమే చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు అంటూ గోవింద కామెంట్స్ చేశారు. తన సినిమాలను కూడా థియేటర్లో సరిగా విడుదల చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువగా ఉండటం కారణంగానే టాలెంట్ ఉన్న ఎంతో మంది నటులు రాణించలేక పోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. రోజురోజుకు ఇండస్ట్రీలో ప్రతిభకు ప్రాధాన్యత తగ్గిపోతుందన్నారు. నెపోటిజం కారణంగా ఎంతోమంది టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతున్నారని అన్నారు. Read More: తన తల్లిదండ్రులు నిర్మలాదేవి, అరుణ్ కుమార్ లు చిత్ర పరిశ్రమకు చెందిన వారు అయినప్పటికీ తనకు మాత్రం ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయన్నారు. నటుడిగా నిరూపించుకునేందుకు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న నెపోటిజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు వస్తున్న సమయంలో తాజాగా గోవింద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39bx5Ci
v
No comments:
Post a Comment