హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మే 20న తన పుట్టనరోజును పురస్కరించుకొని ఒక సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఎక్కడి వలస కార్మికులు అక్కడే ఆగిపోయారు. ఉపాధి లేక, స్వస్థలాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపుతున్నారు. అయినప్పటికీ కొంత మంది వలస కార్మికులు హైదరాబాద్లో చిక్కుకుపోయారు. అలాంటి వారిని ఆదుకోవడానికి మనోజ్ ముందుకు వచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వలస కార్మికులు హైదరాబాద్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి రావడంతో, వాళ్లను సొంత ఊళ్లకు తరలించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. బుధవారం హైదరాబాద్లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురిని రెండు బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించారు. వాళ్లకు అవసరమైన ఆహారంతో పాటు మాస్క్లు, శానిటైజర్స్ను కూడా ఆయన అందజేశారు. ఆ కార్మికులు తమ ఇళ్లకు చేరేంత వరకు మార్గమధ్యంలో అవసరమైన సౌకర్యాలను మనోజ్ టీమ్ కల్పిస్తున్నారు. ఇదే విధంగా గురువారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను హైదరాబాద్ నుంచి వారి ఊళ్లకు బస్సుల్లో పంపేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మనోజ్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే నేను పుట్టినరోజు ఎలా చేసుకోగలనని అభిమానులకు ఒక బహిరంగ లేఖ రాశారు మనోజ్. వలస కార్మికులకు స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేస్తున్నట్టు, ఈ కార్యక్రమంలో తనకు సాయంగా ఉండాలని కూడా ఆ లేఖలో మనోజ్ కోరారు. ఇదే పుట్టినరోజునాడు తనకు ఇచ్చే గిఫ్ట్ అని అన్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g9uBYn
v
No comments:
Post a Comment