Wednesday, 20 May 2020

సినీ కార్మికులకు నటుడు శివాజీ ఆర్థిక సాయం

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. కరోనాను నిర్మూలించేందుకు సుమారు రెండు నెలలపాటు దేశంలో లాక్‌డౌన్ విధించినా ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి లేక ఆర్థకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా పరిశ్రమకు సైతం ఇది గడ్డుకాలం. షూటింగ్స్ లేని కారణంగా ఎంతోమంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. రోజువారీ వేతనానికి పనిచేసే సినీ కార్మికులను ఆదుకోవడానికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటుచేశారు. సినీ పరిశ్రమ నుంచి స్టార్ హీరోల నుంచి చాలా మంది నటులు, దర్శకులు ఈ చారిటీకి విరాళం ఇచ్చారు. ఈ నిధులతో కొన్ని వేల మంది కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు. అయితే, సినీ పరిశ్రమలో ఇంకా ఇబ్బందిపడుతోన్న వారికి సహాయం చెయ్యడానికి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సీనియర్ మెంబర్, నటుడు శివాజీ ముందుకు వచ్చారు. Also Read: గతంలో ఎన్నో సేవ కార్యక్రమమాలు నిర్వహించిన శివాజీ.. టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ద్వారా నిర్మాతల మండలికి 2 లక్షల రూపాయల చెక్‌ను అందజేశారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని శివాజీ తెలిపారు. శివాజీ విరాళం ఇవ్వడం పట్ల టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ధన్యవాదాలు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bLbsZb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...