మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు, శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందించడంలో శంకర్కు ఓ ప్రత్యేకత ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు సాలిడ్ హిట్ వచ్చి చాలా రోజులే అవుతుంది. దీంతో ఆయన చాలా ఫోకస్తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణలో కొంత భాగం పూర్తయ్యింది. రీసెంట్గా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో RC 15 చిత్రీకరణకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం. తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారు చెర్రీ. అందులో ఓ పాత్ర పొలిటీషియన్ అయితే.. మరో పాత్ర ఐఏఎస్ ఆఫీసర్. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో ఓకీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. RC 15కి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్తొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అందులో రామ్ చరణ్, శ్రీకాంత్ స్నేహితులుగా కనిపిస్తారు. ఇద్దరూ కలిసి ఓ రాజకీయ పార్టీని స్టార్ట్ చేస్తారు. ఎన్నికల్లో విజయం కూడా సాధిస్తారట. అయితే రామ్ చరణ్ను మోసం చేసి ఆ పార్టీని కైవసం చేసుకుని వెన్నుపోటు పొడుస్తారట శ్రీకాంత్. ఆ తర్వాత రామ్ చరణ్ తనయుడు మరో రామ్ చరణ్ తన తండ్రి స్థాపించిన పార్టీని ఎలా దక్కించుకున్నారనేదే కథాంశం అని గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారు. సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jqLAY5H
v
No comments:
Post a Comment