టాలీవుడ్ సీనియర్ పాటల రచయిత సీతారామశాస్త్రి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొన్నిరోజులు ముందు వరకు ఆయన నిమోనియా బాధపడ్డారు. ఆ క్రమంలో కాస్త సీరియస్ కావడంతో ఆయన్ని నవంబర్ 24 సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చేర్చారు. ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తూ వచ్చారు. పరిస్థితి ఇంకా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్స్ డాక్టర్స్ ఆయన కుటుంబ సభ్యులను పిలిచి పరిస్థితిని వివరిస్తున్నారు. 1986లో విడుదలైన ‘సిరివెన్నెల’ చిత్రంతో గేయ రచయిత సినీ ప్రస్థానాన్ని సీతారామశాస్త్రి ప్రారంభించారు. తొలి సినిమాతోనే ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన పాటల రచయితగా వెనుదిరిగి చూసుకోలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన ఎన్నో వేల పాటలను రాశారు. పాట ఎలాంటిదైనా అందులో తెలియని ఓ స్ఫూర్తిని నింపి రాయడం ఆయన పెన్నుకున్న గొప్ప అలవాటు. అందుకనే తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనెంతో ప్రీతిపాత్రుడయ్యారు. సిరివెన్నెల అద్భుతమైన కలం నుంచి జాలువారిన పాటలకు నందులెన్నో ఆయనింటికి కదలి వచ్చాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DjsprH
v
No comments:
Post a Comment