Tuesday 30 November 2021

సిరివెన్నెల ఇకలేరు.. శోకసంద్రంలో సినిమా ఇండస్ట్రీ

సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన సిరివెన్నెల కలం ఆగిపోయింది. న్యుమోనియాతో బాధపడుతున్న కన్నుమూశారు. నవంబర్ 24 నుంచి హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఆరోగ్యం.. గత రెండు రోజులుగా ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల. ‘నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని.. అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని’.. ‘రామ బాణం ఆపింది రావణ కాష్టం ’’.. ‘‘కృష్ణ గీత ఆపింది నిత్య కురుక్షేత్రం ’’ ఇలాంటి ఎన్నో ఎన్నెన్నోస్ఫూర్తినిచ్చే గేయాలు రాసి.. తన సాహిత్యంతో ఉత్తేజాన్ని నింపిన సిరివెన్నెల సీతా రామశాస్త్రి మరణంతో సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. 1955 సంవత్సరం మే 20వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. బాలకృష్ణ హీరోగా కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. అయితే 1986లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలు రాసి ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరు తెచ్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rqKMIH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...