Monday 29 November 2021

అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి వచ్చా.. అసలు విషయం చెప్పిన తమన్

ప్రస్తుతం సౌత్‌లో హవా బాగానే కొనసాగుతోంది. తమన్ ఇటు తెలుగు అటు తమిళ పరిశ్రమంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక తెలుగులో అయితే టాప్ హీరోల ప్రాజెక్ట్‌లన్నీ కూడా తమన్ ఖాతాలోనే ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా స్టార్లందరికీ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పది సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటే.. అందులో ఆరేడు చిత్రాలు తమన్ కొట్టినవే ఉంటున్నాయి. అలాంటి తమన్ ఈ మధ్య నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. తాను అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నానికి నచ్చలేదట. అందుకే గోపీ సుందర్‌తో చేయించుకున్నారట. అయితే తమన్ బాలీవుడ్‌లోని కొన్ని పాటలు కొట్టాడు. కానీ బాలీవుడ్ పని తీరు.. మన సౌత్ పనితీరు చాలా వేరు. మన స్టైల్లో పని చేస్తే అక్కడి వాళ్లకు నచ్చదు. ఇక్కడ ఒక్క సినిమాకు ఒకే సంగీత దర్శకుడు ఉంటాడు. కానీ అక్కడి చిత్రానికి ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులుంటారు పాటలు చాలా మంది కంపోజ్ చేస్తారు.. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొకరు ఇస్తారు.. అలాంటివి చూడలేక.. తట్టుకోలేక పారిపోయి వచ్చాను. సినిమా అంత మన చేతుల్లో పెడితే చేయగలం. కానీ అలా పని చేయడం నా వల్ల కాదు. అందుకే బాలీవుడ్‌లో ఎక్కువ మ్యూజిక్ చేయలేదు అని తమన్ అన్నాడు. అజయ్ దేవగణ్ గోల్ మాల్, రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలకు పని చేశాను అంటూ తమన్ నాటి విషయాలను పంచుకున్నాడు. తమన్ ప్రస్తుతం అఖండ, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, లూసిఫర్ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. చిత్రం ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31au3OE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...