తెలుగు సినీ రంగంలో నృత్య దర్శకుడిగా చెరగని ముద్ర వేశారు. అలాంటి లెజెండరీ కొరియోగ్రఫర్ ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనా బాధపడుతున్న ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో మంది సాయం చేశారు. సోనూ సూద్, చిరంజీవి, ధనుష్ ఇలా ఎంతో మంది సాయం చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. శివ శంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రాజమౌళి అయితే మగధీర నాటి రోజులను గుర్తుకు చేసుకున్నాడు. ధీర ధీర సాంగ్కు శివ శంకర్ మాస్టర్కు జాతీయ స్థాయిలో అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నుంచి ప్రతీ ఒక్క హీరో శివ శంకర్ మాస్టర్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. తాజాగా ఆయన మరణ వార్తపై స్పందించింది. ఢీ షోలకు వ్యాఖ్యాతగా ఉదయ భాను వ్యవహరించిన రోజుల్లో శివ శంకర్ మాస్టర్ న్యాయ నిర్ణేతగా ఉండేవారు. అలా అక్కడ ఏర్పడిన బంధాన్ని ఉదయభాను పంచుకుంది. బుల్లితెరపై కామెడీ, పలు ఇతర షోలు, డ్యాన్స్ షోలకు శివ శంకర్ మాస్టర్ ఫేమస్. శివ శంకర్ మాస్టర్ మరణ వార్తను విని షాక్ అయ్యాను అంటూ ఉదయ భాను ఎమోషనల్ అయింది. ఇంత కంటే చెడ్డ వార్త ఉండదు. దారుణమైన వార్త.. ఓ గొప్ప ప్రతిభ గల వ్యక్తిని, ప్రేమించే వ్యక్తి, ఎంతో ప్రోత్సహించే వ్యక్తి.. మా ప్రియమైన శివ శంకర్ మాస్టర్ మాస్టర్ను ప్రపంచం కోల్పోయింది. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం మాస్టర్ అని ఎమోషనల్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3I3jkqb
v
No comments:
Post a Comment