Tuesday 30 November 2021

మహానుభావా వీడుకోలు.. మరొకరు లేరు రాబోరు.. సిరివెన్నెల మృతిపై టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతున్నాయి. రీసెంట్‌గా ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూయగా.. కొద్దిసేపటి క్రితం ప్రముఖ గేయ రచయిత తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల నవంబర్ 24వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకం విడిచి వెళ్లారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. క్రమంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు (మంగళవారం) సాయంత్రం ఆయన కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహానుభావా.. వీడుకోలు.. మరొకరు లేరు.. రాబోరు.. ఇక మీరు లేరనే వార్త జీర్ణించు కోలేకపోతున్నాం అంటూ వెన్నెల కిషోర్ తన సంతాపం తెలిపారు. ''అక్షరానికి అన్యాయం చేసి, సాహిత్యాన్ని ఒంటరి చేసి అందనంత దూరం వెళ్లిపోయిన మహాకవి, మహా మనిషి గురువు గారు సీతారామ శాస్త్రి గారికి కన్నీటి వీడ్కోలు'' అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు. సిరివెన్నెల మరణ వార్త విని షాకయ్యానంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ పెట్టారు. ''సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాను'' అని నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31hxGml
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...