Monday, 18 October 2021

40 ఏళ్లుగా కమ్మ వాళ్ల కూడే తింటున్నా.. రెడ్లు, రాజులు 5 శాతమే.. కోటా ‘కమ్మ’ని పలుకులు వైరల్

‘మా’ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లెజెండరీ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మెగా బ్రదర్ నాగబాబు ఈయనపై ఘాటు వ్యాఖ్యలు చేయడం.. తిరిగి ఈయన కౌంటర్ ఇవ్వడంతో రచ్చ రేగింది. అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉన్న అనసూయ ఎవరో తనకి తెలియదంటూ కామెంట్స్ చేశారు కోటా.. రీసెంట్‌గా ఆమె వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనసూయ మంచి డ్యాన్సర్ మంచి యాక్టర్.. అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేశారు. అనసూయ లాంటి అందమైన అమ్మాయిని ఎలా ఉన్నా చూస్తారు.. ఇలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదంటూ ఆమె వస్త్రధారణ తప్పుపట్టారు పెద్దాయన. అయితే తన వస్త్రధారణ విషయంపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అంతెత్తున లేచే అనసూయ.. కోటాని ఏకిపారేసింది. అది నా పర్సనల్.. వృత్తిపరంగానూ రకరకాల బట్టలు వేసుకోవల్సి వస్తుంది. పెళ్లై పిల్లలున్న స్టార్‌లు హీరోయిన్లతో ఆన్‌ స్క్రీన్ రొమాన్స్‌ చేస్తుంటే ఎందుకు ప్రశ్నించరు అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు కోటా.. ‘మా’ ఎన్నికలు ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య జరిగినప్పటికీ రెండు కులాల మధ్య జరిగిన ఎన్నికలనేది బహిరంగ రహస్యమే. ఇదే విషయాన్ని ఓపెన్‌గా మాట్లాడారు కోటా శ్రీనివాసరావు. నేను ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నానంటే కమ్మవారి వల్లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో కుల ఆదిపత్యం అనేది ఉన్నది అందులో రెండో ప్రశ్నలేదు.. నా వరకూ నేను ఒక సామాజిక వర్గాన్ని గౌరవించుకుంటాను. ఎందుకు అంటే నూటికి 95 శాతం నేను కమ్మ వాళ్ల ఫుడ్ తిన్నాను.. మిగిలిన 5 శాతం రాజులు, రెడ్లు ఉన్నారు. నేను ఓపెన్‌గా చెప్తున్నా.. నేను కమ్మవాళ్ల కూడే తిన్నాను. అది మర్చిపోకూడదు. మంచి చేస్తే మంచి చేశారని చెప్పాలి.. ఇప్పుడు నేను అదే చెప్తున్నా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కోటా శ్రీనివాసరావు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jghUOn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...