Monday, 23 August 2021

అన్ననే ఫాలో అవుతున్న బెల్లకొండ గణేష్.. మరో ప్రాజెక్టును ఓకే చేసిన యువ హీరో..

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సాయి శ్రీనివాస్‌. ఇప్పుడు ఈ యంగ్ హీరో తమ్ముడు గణేష్‌ బాబు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై ఫోకస్ పెట్టాడు. తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు బాలీవుడ్‌లో ‘ఛత్రపతి’ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి స్వయంగా ఈ సినిమాను ప్రారంభించారు. అయితే సినిమాల విషయంలో అన్న స్టైల్‌లో ఫాలో అవుతున్నారు గణేష్. అందుకే వరుసగా సినిమాలను లైన్ పెట్టేస్తున్నారు ఆయన. ఇప్పటికే ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమాలో ‘మజిలీ’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌‌గా నటించిన అనన్య అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో పాటు ఆయన లేటెస్ట్‌గా మరో సినిమాను కూడా ఆరభించారు. నేపథ్యంలో సాగే కథ ఇది. రెగ్యులర్‌ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది’ అని చిత్రబృందం తెలియజేసింది.‘నాంది’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఎస్‌.వి. 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. రాకేశ్‌ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత క్లాప్ కొట్టి ఈ సినిమాను ప్రారంభించగా.. కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరి తన సోదరుడిలా గణేష్ కుడా మంచి సక్సెస్ సాధిస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/388gEXC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...