Wednesday, 21 July 2021

Sarkaru Vaari Paata: ఆ విషయంలో మహేష్ బాబు సీరియస్.. వెంటనే రూల్ పాస్ చేసిన పరశురామ్!

ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలను లీకుల బెడద వెంటాడుతోంది. టెక్నాలజీ బాగా పెరిగి ప్రతి ఒక్కరి చేతిలో హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ ఉండటంతో ఏదో ఒక రూపంలో షూటింగ్ స్టిల్స్, వీడియోస్ బయటకొస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా '' విషయంలోనూ అదే జరుగుతోంది. దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలతో షూటింగ్ చేస్తున్నా లీకులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ లీకుల వ్యవహారం తెలిసి నిరాశ చెందిన మహేష్ బాబు.. చిత్రయూనిట్‌పై సీరియస్ అయినట్లు సమాచారం. 'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో ప్రారంభమైనప్పటి నుంచి తాజా షెడ్యూల్ వరకు సెట్‌లోని కొన్ని పిక్స్ లీకవుతూనే ఉన్నాయి. దీంతో బాగా హర్ట్ అయిన మహేష్ బాబు.. ఇకపై ఏ లీకు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయమని చెప్పారట. చిత్ర యూనిట్ అంతా చాలా జగ్రత్తగా ఉండాలని సూచించారట. దీంతో అప్రమత్తమైన యూనిట్ సభ్యులు షూటింగ్ లొకేషన్ లోకి ఎవ్వరూ మొబైల్ తీసుకురాకుండా ఉంటే మంచిదని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు డైరెక్టర్ పరశురామ్ వెంటనే ఓ రూల్ కూడా పాస్ చేశారని తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న నయా మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. మహేష్ బాబు 27వ సినిమా రాబోతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BoGO62
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...