Monday, 12 April 2021

కీలక పదవి నుంచి తప్పుకున్న దీపికా పదుకొనే.. ఇ‌న్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన.. కారణం అదే..

తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’తో సూపర్ హిట్ అందుకున్న ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హిట్లతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. అటు గ్లామరస్ పాత్రలతో పాటు.. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చరిత్రాత్మక సినిమాల్లో కూడా నటించి.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. దీంతో పాటు హాలీవుడ్‌లో స్టార్ హీరో విన్ డీజల్ సరసన ‘త్రిపుల్ఎక్స్’ సినిమాలో నటించి.. అంతర్జాతీయ గుర్తింపు సాధించింది దీపికా. అయితే తాజాగా దీపికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్(ఎంఏఎంఐ) సంస్థ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్ననని దీపికా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తన బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపింది. ఇంతకాలం తను ఆ పదవిలో ఉండటం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్‌ను ముంబైకి రప్పించడానికి ఈ పదవి ద్వారా ఎంతో కృషి చేశానని చెప్పిన దీపిక ఒక నటిగా ఇందుకు ఎంతో గర్వపడుతున్నానని స్పష్టం చేసింది. మరో సమర్థవంతమైన వ్యక్తి ఈ సంస్థని మరింత ముందుకు తీసుకువెళ్లానని ఆశాభావం వ్యక్తం చేసింది. 2019లో ఎంఏఎంఐ ఛైర్మన్ బాధ్యతలను చేపట్టింది దీపికా. ప్రస్తుతం దీపికా.. భర్త హీరోగా నటించిన 83 చిత్రంలో అతనికి జోడీగా నటిస్తోంది. టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ తర్వాత హాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘ది ఇంటర్న్’ మూవీ రీమేక్‌లో అమితాబ్‌తో పాటు దీపికా పదుకొనే కూడా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dY1Ygb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...