లోకనాయకుడు , తలా అజిత్లపై దర్శకుడు, నటుడు, సినీ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్, తమ సినిమాల ద్వారా భరతనాట్యంకి తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. శ్రీరామ్ తాజాగా భరతనాట్యం నేపథ్యంలో ‘కుమార సంభవం’ అనే సినిమాని నిర్మించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన కమల్ మరియు అజిత్లపై ఈ వ్యాఖ్యలు చేశారు. తను, తన తండ్రి పీకే ముత్తు భరతనాట్యం కళకారులమని చెప్పిన ఆయన.. తన తండ్రి సినీ దిగ్గజం శివాజీ గణేషన్కు భరతనాట్యం నేర్పించారని చెప్పారు. అంతేకాక.. ఆయన పలు సినిమాలకు కూడా పని చేశారని అన్నారు. కానీ, గత కొంతకాలంగా భరతనాట్యాన్ని అవమానపరిచేలా సినిమాలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరలారు అనే చిత్రంలో అజిత్ భరతనాట్యం నేర్చుకున్న కారణంగానే అతనికి వివాహం కాలేదని చూపించారు. అంతేకాక, మరో చిత్రంలో కమల్హాసన్ భారతనాట్య కళాకారులు కాబట్టే భార్య, పిల్లలు అతన్ని వదిలివెళ్లినట్లు చిత్రీకరించారు. కమల్ హాసన్ కూడా ఇలాంటి సినిమాలు తీస్తాడా అని ఆశ్చర్యానికి గురయ్యాను. వీళ్లిద్దరు కూడా తమ సినిమాల ద్వారా ఓ భరతనాట్య కళాకారుడిని అమ్మాయిలు ఇష్టపడరనే తప్పుడు సంకేతాలను ఇస్తున్నారు. ఇది నిజంతగా కళని అవమానించినట్లే’ అని శ్రీరామ్ అన్నారు. అయితే ఈ కామెంట్స్పై కమల్, అజిత్ అభిమానులు ధీటుగా స్పందిస్తున్నారు. ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని వాళ్లు కామెంట్ చేస్తున్నారు. తన సినిమాను పాపులర్ చేసుకోవడానికి సాయి శ్రీరామ్ ఆడుతున్న చీప్ ట్రిక్ ఇవి అని.. ఇంకోసారి తమ అభిమాన నటులపై ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే ఊరుకోబోమని వాళ్లు హెచ్చరిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uwrlN0
v
No comments:
Post a Comment