Sunday, 18 April 2021

ఎదుగుతున్న సమయంలో.. ఆ విషయం తెలిసింది.. రాశీ ఖన్నా కామెంట్స్ వైరల్

సెలెబ్రిటీలైనా సాధారణ ప్రజలైనా సరే తల్లిదండ్రుల ప్రేమకు బానిసలవ్వాల్సిందే. తల్లిదండ్రులే రియల్ వారియర్స్ అవుతారు. వారి వల్లే నిజమైన ప్రేమకు అర్థాన్ని తెలుసుకుంటారు. అలా ఇప్పుడు తన తల్లిదండ్రులను తలుచుకుని ఎమోషనల్ అవుతోన్నారు. అలా తన పేరెంట్స్‌ను తలుచుకోవడానికి కూడా ఓ ప్రత్యేక కారణం ఉంది. రాశీ ఖన్నా తల్లిదండ్రుల వివాహా దినోత్సవం నేడు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా కాస్త ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో ఓ పోస్ట్ చేస్తూ పేరెంట్స్ మీదున్న ప్రేమను వ్యక్తపరిచారు. మామూలుగానే రాశీ ఖన్నా తన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. ఆ మధ్య రాశీ ఖన్నా బర్త్ డే సందర్భంగా తన పేరెంట్స్ చేసిన అరేంజ్మెంట్స్, ఇచ్చిన సర్ ప్రైజ్‌కు ఆమె ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు తన తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా రాశీ ఖన్నా ఓ పోస్ట్ చేశారు. ఎంతో గొప్ప, అద్భుతమైన తల్లిదండ్రులకు వివాహా దినోత్సవ శుభాకాంక్షలు. నిజమైన ప్రేమకు చిహ్నాలు మీరే. మేం ఎదుగుతున్న సమయంలో మీ మధ్య ఉన్న ప్రేమ కూడా పెరుగుతూ ఉండటం నేను చూశాను. నిజమైన ప్రేమ ఇంకా ఈ ప్రపంచంలో ఉందనే విషయాన్ని మీ వల్లే నేను తెలుసుకున్నాను.. నిజ ప్రేమ ఉందని నమ్మాను అంటూ రాశీ ఖన్నా ఎమోషనల్ అయ్యారు. రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు, టాలీవుడ్‌లో ఓ సినిమా, బాలీవుడ్‌లో ఓ క్రేజీ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో గోపీచంద్ మారుతి కాంబోలో రాబోతోన్న పక్కా కమర్షియల్ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3akS8nO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...