వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అస్సలు తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బూతులు తిట్టినా, తనపై సినిమా తీస్తున్నా.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కొచ్చి మొహం మీద కొడుతున్నారు వర్మ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సెటైరికల్గా ‘పవర్ స్టార్’ అనే సినిమాను వర్మ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ‘గడ్డి తింటావా’ అనే పాటను ఆదివారం వర్మ విడుదల చేశారు. ఈ పాటకు యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ పాటకు 17 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. Also Read: ఈ పాటను యూట్యూబ్లో 75 వేల మంది లైక్ చేయగా.. 60 వేల మంది డిజ్లైక్ చేశారు. అయితే, తన సినిమాలోని పాటకు 17 లక్షల వ్యూస్ రావడం పట్ల వర్మ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అంకితం ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే, వర్మకు ఈ విజయం ఇంకా సరిపోలేదట. రేపు (జూలై 22) ఉదయం 11 గంటలకు ‘పవర్ స్టార్’ ట్రైలర్ విడుదలయ్యే సమయానికి ‘గడ్డి తింటావా’ సాంగ్ వ్యూస్ 20 లక్షలు దాటాలని వర్మ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన మిగిలిన స్టార్ హీరోల అభిమానుల సహాయం కోరుతున్నారు. రేపు ఉదయం 11 గంటల లోపు ఈ పాట 20 లక్షల వ్యూస్ను చేరువయ్యేలా చేయాలని ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, రవితేజ అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరారు వర్మ. ఈ ట్వీట్లో ఆయా హీరోల ట్విట్టర్ అకౌంట్లన్నీ ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్కు రకరకాల స్పందనలు వస్తున్నాయి. తిట్టినవాళ్లు తిడుతున్నారు.. నవ్వుకున్నవాళ్లు నవ్వుకుంటున్నారు. కొంత మంది హీరోల అభిమానులు మా సపోర్ట్ మీకే అని వర్మకు వత్తాసు పలుకుతున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ ద్వారా ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టారు వర్మ. కాగా, రేపు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదలయ్యే ట్రైలర్ను రూ.25 చెల్లించి చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WIuSt8
v
No comments:
Post a Comment