‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’.. ఇప్పుడు ఈ పేరు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎవరైనా నాకు ఛాలెంజ్ చేస్తే బాగుండు.. నేను సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగస్వామ్యం కావలి అనే స్థాయికి వెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పెంచి, ప్రతి ఒక్కరికి తమ వంతు సామాజిక బాధ్యత నెరవేర్చేలా అవగాహన కల్పించడమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశం నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. Also Read: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, పిల్లలు సైతం పాల్గొని మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇటీవల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన.. మరో హీరోయిన్ రాశీ ఖన్నాకు ఛాలెంజ్ విసిరారు. రష్మిక ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించారు. షేక్పేటలోని జేఎంఆర్ వైట్ లోటస్లో ఉన్న తన నివాసం ఆవరణలో రాశీ ఖన్నా ఈరోజు మూడు మొక్కలు నాటారు. అనంతరం రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ‘‘సంతోష్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం. పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణ సమత్యులత కోసం మొక్కలు నాటడం ఎంతో అవసరం. భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుంది’’ అని అన్నారు. Also Read: అంతేకాదు, తన అభిమానులందరూ ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను ముందుకు తీసుకువెళ్లాలని, ప్రతి అభిమాని మూడు మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్లో భాగంగా ముగ్గురు స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నాలను రాశీ ఖన్నా నామినేట్ చేశారు. తన ఛాలెంజ్ను స్వీకరించి ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలని వారిని రాశీ కోరారు. ఈ కార్యక్రమంలో తనను భాగం చేసినందుకు ఎంపీ సంతోష్కు రాశీ థ్యాంక్స్ చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CkAMK5
v
No comments:
Post a Comment