బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణం తర్వాత సినీ ఇండీస్ట్రీలో నెపోటిజంపై వాదనలు ముదిరాయి. పలువురు నటీనటులు ఇండస్ట్రీలో ఉన్న బంధు ప్రీతి కారణంగా తాము ఎన్నో అవకాశాలు కోల్పోయామంటూ నోరు విప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాహూ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన .. అనే అంశంపై రియాక్ట్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలు బంధు ప్రీతి కారణంగా మిస్సయ్యాయని చెప్పింది ఎవ్లీన్ శర్మ. కొన్ని సినిమాలకు ఎంచుకొని, అగ్రిమెంట్ కూడా అయ్యాక రాత్రికి రాత్రే తొలగించారని చెప్పింది. వచ్చిన అవకాశం చివరి నిమిషంలో అలా చేజారిన సందర్భాల్లో ఎంతో బాధేసేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో అయితే హీరో గర్ల్ ఫ్రెండ్ కోసం తనను తీసేయడం జరిగిందని, ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని ఎవ్లీన్ ఆవేదన వ్యక్తం చేసింది. Also Read: నెపోటిజం కారణంగా తన కెరీర్లో చాలా అవకాశాలు కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఎవ్లీన్ శర్మ పేర్కొంది. అయితే అలా చేజారిన అవకాశాల వల్ల నిరాశ చెందలేదని ఆమె చెప్పింది. ఆ ఘటనలే తనలో మరింత ధైర్యాన్ని పెంపొందించాయని తెలిపింది. బాలీవుడ్లో అధికారం, డబ్బు ఉన్న వాళ్లదే రాజ్యమని, ఇక్కడ ఉన్నవాడిదే ఆధిపత్యమని ఈ బాలీవుడ్ బ్యూటీ క్లారిటీగా చెపేప్సింది. అయితే ఎప్పుడూ కాంట్రవర్సీలకు కాస్త దూరంగా ఉండే ఎవ్లీన్ శర్మ తాజాగా నెపోటిజం అంశంపై నోరు విప్పడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె వాదనకు ఓ వర్గం నుంచి సపోర్ట్ కూడా లభిస్తుండటం గమనార్హం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30wzofv
v
No comments:
Post a Comment