Tuesday, 12 May 2020

Balakrishna: బాలకృష్ణ ఫ్యాన్స్ నన్ను అందుకే ఎటాక్ చేశారు: సింగర్ సమీరా భరద్వాజ్

‘తెలుసా.. తెలుసా ప్రేమించానని’, ‘మధురమే ఈక్షణమే చెలి’, ‘చంపేశావే నన్ను వంటి సూపర్ హిట్ సాంగ్స్‌ పాడిన సమీరా భరద్వాజ్ అనుకోకుండా చేసిన చిన్న పొరపాటు వల్ల బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూసింది. బాలయ్య బాబుతో గేమ్సా అంటూ ఎన్నో బెదిరింపులు చూసింది. ఇంతకీ ఈ రచ్చ ఎందుకురేగిందో తెలియజేస్తూ అసలు విషయాన్ని తెలిపింది సమీరా భరద్వాజ్. ‘బాలకృష్ణ ఫ్యాన్స్‌తో ఇష్యూ ఎక్కడ మొదలైందంటే.. నాకు డబ్ స్మాష్ యాప్ గురించి పెద్దగా తెలియదు. అందరూ వాడుతున్నారు కదా అని నేను మొదలుపెట్టా. డబ్ స్మాష్‌లో ఎలా ఉంటుందా అని ట్రై చేయడానికి నా ఫస్ట్ వీడియో గారి డైలాగ్ చెప్పా.. నిజానికి నాకు ఎలాంటి ఐడియా లేదు.. ఇది పోస్ట్ చేస్తే ఏమౌతుంది అని కూడా ఆలోచించలేదు. ఆ వీడియో పోస్ట్ చేసి ఇంట్లో నా పనులు నేను చేసుకుంటూ పాటలు పాడుకుంటున్నా.. సడెన్‌గా నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి.. నీ వీడియో ఏంటి వాట్సాప్ ఫార్వర్డ్‌లో వస్తుంది అని. మా ఆయనకు కూడా వాట్సాప్‌లో వీడియో వచ్చింది. అందులో బాలకృష్ణ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తూ.. సింగర్‌వి సింగర్‌లా ఉండు అంటూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఎటాక్ చేశారు. నేను వెంటనే అలర్ట్ అయ్యి ఆ వీడియో తీసేశాను. కాని అప్పటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసేశారు. దీంతో నేను సారీ చెప్తూ.. నేను బాలకృష్ణ ఫ్యాన్‌నే ఫర్ గివ్ మీ అని ఫేస్ బుక్‌లో వీడియో పెట్టా. దీంతో వాళ్లు శాంతించారు. మళ్లీ అలాంటి తప్పు చేయలేదు. తరువాత బాలయ్య బాబు ‘డిక్టేటర్’ సినిమాలో పాట కూడా పాడాను. అప్పుడు బాలయ్య ఫ్యాన్స్ చల్లబడ్డారు’ అంటూ బాలయ్య ఫ్యాన్స్‌తో జరిగిన గొడవను చెప్పుకొచ్చింది .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T0vVTr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...