Tuesday 31 March 2020

ముంబై నుంచి వస్తారు.. కోట్లు తీసుకుంటారు: హీరోయిన్లపై బ్రహ్మాజీ ఫైర్

కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి హీరోయిన్లు ముందుకు రాకపోవడంపై నటుడు బ్రహ్మాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఈ ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఇండస్ట్రీలో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయాలు. వారందరినీ ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్ హీరోల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అయితే, లావణ్య త్రిపాఠి మినహా ఏ హీరోయిన్ విరాళాలు ప్రకటించలేదు. లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బ్రహ్మాజీ హీరోయిన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముంబై నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లుగా కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. కానీ, వారెవ్వరూ కార్మికుల సంక్షేమం గురించి స్పందించడం లేదు. లావణ్య త్రిపాఠి ఒక్కరే విరాళం ఇచ్చారు. మిగిలిన వారు ఛారిటీకి విరాళం ఎందుకు ఇవ్వడం లేదు? దీన్ని డబ్బు ఇవ్వడంగా భావించకూడదు.. ఇండస్ట్రీకి వారు చూపించే కృతజ్ఞత’’ అని బ్రహ్మాజీ అన్నారు. Also Read: అలాగే, ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్‌లో నటిస్తోన్న సహాయ నటులపై కూడా బ్రహ్మాజీ ఫైర్ అయ్యారు. వాళ్లు కూడా విరాళాలు ఇవ్వాలని అన్నారు. కాగా, సీసీసీకి బ్రహ్మాజీ రూ.70వేల విరాళాన్ని ప్రకటించారు. ఆయన తనయుడు సంజయ్ రావు కూడా రూ.25 వేలు అందించారు. ఇక హీరోలు అయితే భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, నాగార్జున చెరో కోటి రూపాయలు అందించారు. మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, రామ్ చరణ్ రూ.30 లక్షలు.. ఇలా చాలా మంది హీరోలు విరాళాలు అందజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JpNp6v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...