Tuesday 31 March 2020

ఛారిటీ అంటే రౌడీ మామూలు కాదు: డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు

కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. వీటిలో మన దేశం ఉన్నప్పటికీ ఆ దేశాలతో పోలిస్తే మన దగ్గర కరోనా ప్రభావం కాస్త తక్కువనే చెప్పాలి. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సంచలన నిర్ణయాలు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. అంతేకాకుండా కరోనా నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న పేద ప్రజలను ఆదుకోవడానికి, ప్రభుత్వానికి మద్దతుగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మన సినీ తారలు విరాళాలు ప్రకటించారు. అలాగే, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో తెలుగు సినీ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్లను ఆదుకోవడం కోసం తెలుగు సినీ పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.)ని ప్రారంభించింది. ఈ ఛారిటీ విరాళాలు ఇవ్వాల్సిందిగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రముఖులను అభ్యర్థించారు. ఆయన వంతుగా కోటి రూపాయలు ఇచ్చారు. చిరంజీవి పిలుపు మేరకు చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు విరాళాలు అందజేస్తున్నారు. విరాళాలు అందజేస్తున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు. Also Read: అయితే, విరాళాలు ఇచ్చిన వారి పేర్లలో కొంత సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా వాళ్లపై కొంత మంది నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు, ‘ప్రస్థానం’ ఫేమ్ దేవా కట్టా ట్విట్టర్ ద్వారా స్పందించారు. కోవిడ్-19 అనే కాకుండా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టమొచ్చినా తమ వంతు సాయాన్ని అందించే ఎంతో మంది మంచి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని, వారంతా తనకు వ్యక్తిగతంగా తెలుసని దేవా కట్టా అన్నారు. వారికి పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టలేక విరాళాల విషయాన్ని బయటికి చెప్పరని స్పష్టం చేశారు. దాన్ని వారొక ఆధ్యాత్మిక, వ్యక్తిగత చర్యగా భావిస్తారని అన్నారు. అయితే, విరాళాలు ఇచ్చినట్టు ప్రకటించుకున్న వారి ఆలోచన వెనుక కూడా ఒక పాయింట్ ఉందన్నారు. ఇలా చేయడం వల్ల మరికొంత మంది విరాళాలు ఇవ్వడానికి ప్రోత్సహించినట్టు అవుతుందని దేవా కట్టా అన్నారు. విరాళాలు ఇచ్చి బయటకు చెప్పని కొంతమంది ఉన్నారని.. విషయం తెలుసుకోకుండా అలాంటి వాళ్లను విమర్శించడం తెలివితక్కువ తనం అని కాస్త ఘాటుగానే అన్నారు. వాళ్ల దృష్టికోణాన్ని అర్థం చేకోవడం మన బాధ్యత అని చెప్పారు. ఛారిటీ అంటే సామాజిక ఒత్తిడి వల్ల ఇచ్చే రౌడీ మామూలు కాదని స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UwBc6r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...