టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కరోనాతో గత కొన్ని రోజులుగా పోరాడుతూ వచ్చిన మాస్టర్.. ఆదివారం కన్నుమూశారు. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఇతర సమస్యలు, ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకడంతో మృతి చెందారు. శివ శంకర్ మాస్టర్ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మాస్టర్ మరణంపై టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులే కాకుండా దక్షిణాది సినీ ప్రముఖులంతా కూడా సంతాపాన్ని ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు పంచవటి కాలనీలోని నివాసానికి పలువురు నటీనటులు, కళాకారులు హాజరై శివశంకర్ మాస్టర్కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. యాంకర్, నిర్మాత, దర్శకుడు తోపాటు ఆయన సోదరుడు అశ్విన్ బాబు, శివశంకర్ మాస్టర్ పాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓంకార్ షోలతో శివ శంకర్ మాస్టర్ క్రియేట్ చేసిన మార్క్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఓంకార్ షోలు అందులో శివ శంకర్ మాస్టర్ జడ్జ్మెంట్ అంటే ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై శివ శంకర్ మాస్టర్ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక శివ శంకర్ మాస్టర్ హాస్పిటల్లో ఉన్న సమయంలో సోనూ సూద్, చిరంజీవి, ధనుష్ వంటి వారు ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. కానీ వారి సాయం, వారి ప్రయత్నం ఫలించలేదు. దాదాపు వెయ్యికి పైగా చిత్రాలకు ఆయన కొరియోగ్రఫర్గా వ్యవహరించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31gIL76
v
No comments:
Post a Comment