టక్ జగదీష్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నాని తన సినిమాను అమెజాన్కు ఆల్రెడీ అమ్మేశారు. ఆ విషయంలో కాస్త డీల్ సరిగ్గా కుదరలేదని, తిమ్మరుసు ఈవెంట్లో థియేటర్ల గురించి కాస్త ఎక్కువగా మాట్లాడారు.. తద్వారా నాలుగు కోట్లు ఎక్కవగా డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు చేసింది తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంస్థ. సునీల్ నారంగ్ తన సినిమా లవ్ స్టోరీని సెప్టెంబర్ 10న విడుదల చేస్తానని ప్రకటించడం, సినిమా సైతం ఓటీటీలో అదే తేదీన వస్తోందని తెలియడంతో అందరూ భగ్గుమన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఆ సమావేశంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. నానిని చెడుగుడు ఆడున్నారు. పిరికిపంద అని తిట్టారు. సినిమాల్లోనే హీరోవి బయట మాత్రం కాదు అని నానా రకాలుగా అవమానించారు. నాలుగు కోట్ల డీల్ కోసమే ఈవెంట్లో అలా మాట్లాడావని ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారని గుసగుసలు వినిపించాయి. తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంస్థ బహిరంగంగా అందరికీ సారీ చెప్పింది. తమ వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండని కోరింది. తమ పరిస్థితిని వివరించేందుకే అలా మాట్లాడవలసి వచ్చిందని తెలిపింది. అయితే తాజాగా నానికి మద్దతుగా యాక్టివ్ ఓ లేఖను వదిలింది. సినిమాపై పూర్తి హక్కు నిర్మాతకే ఉంటుంది. సినిమా తీసేది ఆయనే. ఆయన వల్లే సినిమాలు ప్రారంభమవుతుంది. అది ఎప్పుడు ఎవరికి ఇచ్చుకోవాలనేది ఆయన ఇష్టం. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది నిర్మాతలు, హీరోలు, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమూహంతో ఏర్పడింది. కానీ కరోనా వల్ల ప్రతీ ఒక్కరు నష్టపోయారు. నిర్మాతలు తమ సినిమాలను ఎవరికి ఎప్పుడు అమ్ముకోవాలే చెప్పే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. అందరూ కలిసి ఒకరినొకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అంటూ సుదీర్ఘ లేఖను వదిలింది. దీంట్లో మొత్తానికి నానికి సపోర్ట్ ఇస్తూనే.. తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3881mlH
v
No comments:
Post a Comment