Saturday, 10 July 2021

OTTపై కోటా కొరడా.. లక్ష సంపాదనకి నాకు 26 ఏళ్లు పట్టింది: కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

ఎన్ని OTT ప్లాట్ ఫామ్స్ వచ్చినా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తేనే మజా. ప్రేక్షకుల మధ్య ఈలలు వేస్తూ గోల చేస్తూ సినిమా చూడటంలో ఉన్న కిక్కే వేరు. ఓటీటీ హవాతో థియేటర్స్‌ కల పోయింది. కాలక్రమంలో ఈ సందడి కనిపించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఓటీటీ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు . ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం వస్తున్న సినిమాలు సగానికి సగం ఆడకుండా పోవడానికి కారణం ‘ఓటీటీ’. జనం చేతిలోకి సినిమా వచ్చేస్తుంటే.. థియేటర్‌కి ఎవడు వెళ్తాడు. ఇదివరకు కాలక్షేపం కోసం థియేటర్‌కి వెళ్లే పరిస్థితి ఉండేది ఇప్పుడు అలాంటిదేం లేదు.. ఇప్పుుడు ఎంటర్ టైన్మెంట్ పోయింది. చేతిలోకి సినిమా వచ్చేసింది. రాను రాను థియేటర్లు అన్నీ కళ్యాణమండపాలు చేసుకోవల్సిందే. నాకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చేవారంటే.. నాకు లక్ష రూపాయిలు ఇవ్వడానికి 26 ఏళ్లు పట్టింది. ఇప్పుడు రోజుకి లక్ష.. గంటల లెక్కల లక్షలు తీసుకుంటున్నారు. నేను ఎప్పుడూ ఇంత కావాలని డిమాండ్ చేయలేదు. అది నా వీక్నెస్ అనుకోవచ్చు.. బతకనేర్చలేని తనం అని అనండి.. కానీ నిర్మాతలు నీకు ఇంత ఇస్తాం అనేవారు.. నేను అంత తీసుకునేవాడిని. ఎవరైనా తెలిసిన చనువున్న నిర్మాతల్ని అయితే పదో పరకో ఎక్కువ ఇవ్వండని అడిగేవాడిని. అంతేతప్ప నాకు ఇంత ఇవ్వాల్సిందే అని ఎప్పుడూ అనలేదు. ఇన్నేళ్ల నా సర్వీస్‌లో ఎంతో మందితో పనిచేశా.. ఒక్కరితోనైనా కోటా డబ్బుల కోసం ఇబ్బంది పెట్టాడని అనిపించండి.. ఎప్పుడూ కూడా అలాంటిది జరగలేదు. అందుకే నేను ఇక్కడే ఉండిపోయానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కోటా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VuFz4P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...