Wednesday, 14 July 2021

బాబాయ్ బాటలో అబ్బాయ్.. త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్న సురేష్ బాబు! ఇదీ మ్యాటర్

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతబడటంతో క్రమంగా పెద్ద సినిమాలు సైతం ఓటీటీ బాట పట్టడం చూస్తున్నాం. గత సంవత్సరం నుంచి కరోనా విజృంభణతో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. దీంతో బడా నిర్మాతల చూపు ఆన్‌లైన్ వేదికలపై పడుతోంది. ఇప్పటికే వెంకటేష్ హీరోగా రూపొందిన 'నారప్ప' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు లీడ్ రోల్ పోషించిన '' మూవీ కూడా అదే దారిలో వెళ్లబోతోందనే సమాచారం అందుతోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విరాటపర్వం' మూవీలో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయింది 'విరాటపర్వం' మూవీ. మొదట్లో ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని భావించిన నిర్మాత సురేష్ బాబు.. తాజా పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. నారప్ప లాగే విరాటపర్వం సినిమాను కూడా ఓటీటీ లోనే విడుదల చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు 'విరాటపర్వం' సినిమా రైట్స్ కోసం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం భారీ మొత్తం ఆఫర్ చేయడంతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారని టాక్. దీనిపై త్వరలోనే ఆయన అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ టాక్. ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్ర పోషించనుండగా, సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటించనుందని తెలుస్తోంది. వృత్తిలో భాగంగా రానాను ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన సాయిప‌ల్ల‌వి.. అత‌నితో ప్రేమ‌లో పడుతుందని, ఆ తర్వాత కొన్ని మ‌లుపులు తిరిగి రానా జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి రావడం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అప్‌డేట్స్ ఆసక్తి రేకెత్తించడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VFze6G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...