Tuesday, 13 July 2021

మురళీమోహన్‌కి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అవకతవకలపై సంచలన తీర్పు

ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు నటుడు . హీరోగా కెరీర్ ఆరంభించిన ఆయన ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. పౌరణికం అయినా.. సాంఘీకం అయినా.. జోనర్‌తో సంబంధం లేకుండా ఆయన ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఒక కొన్నాళ్ల తర్వాత సహాయ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన ఆ పాత్రల్లోనూ అద్భుతంగా నటించారు. ఇప్పటికీ కూడా సహాయ నటుడుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక నటుడుగానే కాకుండా మంచి బిజినెస్ మ్యాన్‌గా కూడా మురళీమోహన్ తనని తాను నిరూపించుకున్నారు. ‘జయభేరీ’ అనే సంస్థను స్థాపించి.. ఆయన వ్యాపారవేత్తగా తన సత్తా చాటుకున్నారు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో మురళీమోహన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓ ఫ్లాట్ వివాదంలో అత్యున్నత న్యాయస్థానంలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త.. మురళీమోహన్ ‘జయభేరీ’ సంస్థ నుంచి కొండాపూర్ ప్రాంతంలో ఓ స్థలం కొనుగోలు చేశారు. అయితే ఈ ఫ్లాట్‌లో అవకతవకలు జరిగాయంటూ మధుసూదన్‌కి తెలియడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హెచ్‌ఎండీఏ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ స్థలం ఉన్నట్లు రుజువు కావడంతో ఆయన జయభేరీపై అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేశారు. దీనిపై పరస్ఫర వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. జయభేరి తరఫు వాదనలను తోసిపుచ్చింది. మధుసూదన్ వైపు న్యాయం ఉన్నట్లు తేలడంతో అతనికే అనుకూలంగా తీర్పును వెలువరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UKhjem
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...