Tuesday, 20 July 2021

దాసరి పోయిన తర్వాత ఇండస్ట్రీలో ఓ వాక్యూమ్ ఏర్పడింది: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గతంలోకంటే రంజుగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ రోజు రోజుకీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో మంచు విష్ణు, సై అంటే సై అనడానికి రెడీ అయ్యారు. ఒకరిపై ఒకరు సవాలు విసురుతూ.. రాజకీయ ఎన్నికలను తలదన్నేలా ఈ ఎన్నికలను మార్చారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తే.. కూడా తనదైన స్టైల్‌లో ప్రచారం ప్రారంభించాడు. ఉన్న 500 ఓట్లను ఆకర్షించేందుకు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు పావులు కదుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని కోరుతూ నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఇందులో పలు ఆసక్తిమైన విషయాలను తెలియజేశారు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన చేసిన కామెంట్స్ సర్వత్ర ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఏది చెబితే అది వినేవారని ఇప్పుడు ఆ విధానం మారిపోయిందంటూ విష్ణు పేర్కొన్నారు. ‘నేను కచ్చితంగా పోటీ చేస్తున్నాను. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు నన్ను నిలబడమని చెప్పడం వల్లే నేను బరిలోకి దిగాను. నాకు చెప్పినప్పుడు రేసులో మరెవరూ లేరు. దాని తర్వాత ఎన్నో అవకతవకలు జరిగాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను. కుటుంబంలో జరిగే విషయాలు బయటపెడితే మంచిది కాదు. అయితే కుటుంబంలోని పెద్దలందరూ కలిసి ఇలా ఉంటే బాగుటుంది అంటే నేను వాళ్లకి గౌరవం ఇచ్చి దాన్ని అంగీకరిస్తాను. ఎన్టీఆర్, ఎఎన్నార్, దాసరి నారాయణ రావు ఉన్నప్పడు వాళ్లు చెప్పినట్లు అందరూ విన్నారు. దాసరి పోయిన తర్వాత ఓ వాక్యుమ్ ఏర్పడింది. ఆ తర్వాత పెద్దలందరూ కూర్చొని ఓ కమిటీని ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్లు ఎలా చెబితే అలా నడుచుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని మంచు విష్ణు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ingfFq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...