Tuesday, 13 April 2021

బండ్ల గణేష్‌కి మళ్లీ కరోనా.. ఐసీయూలో చికిత్స? యాంకర్ సుమ‌ ముందు జాగ్రత్త.. వైరల్ ఫొటో

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌ మళ్లీ కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. జూలై నెలలో కరోనాని జయించిన మళ్లీ ఇప్పుడు రెండోసారి కరోనా బారిన పడటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బండ్ల గణేష్‌కి కరోనా సోకడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కానీ.. ఆసుపత్రి వర్గాలు కానీ ధృవీకరించలేదు. ఇదిలాఉంటే.. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ చేసిన ప్రసంగం వైరల్ అయ్యింది. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్.. నెట్టింట నేటికీ టాప్ ట్రెండింగ్‌లోనే ఉంది. అయితే ఈ ఈవెంట్‌లో బండ్ల గణేష్ మాస్క్‌లేకుండా కనిపించారు. దీంతో ఆ వేడుకకు హాజరైన వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే బండ్ల గణేష్ మాట్లాడిన తరువాత యాంకర్ సుమ.. ఆ మైక్‌ని శానిటైజ్ చేస్తూ కనిపించింది. ఆమె కామెడీకి అలా చేసినా.. ఇప్పుడు నిజంగానే బండ్ల గణేష్‌కి కరోనా సోకిందనే వార్తలు వార్తలు రావడంతో సుమ ముందుగానే గ్రహించినట్టు ఉందే అంటూ ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sfn5Qz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...