Tuesday, 9 March 2021

Jr. NTR: ఎన్టీఆర్‌ని అనాథలా చూశారు.. అతనికి రాజకీయ పరిజ్ఞానమే ఉంటే..! పోసాని సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ నటుడు, రచయిత మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ టాపిక్స్ తీస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన పోసాని.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. అవసరం ఉన్నపుడు ఒకలా.. ఆ అవసరం తీరిపోయాక మరోలా ఉండే రాజకీయ నాయకుడు చంద్రబాబు అంటూ ఆయన తీరును ఎండగట్టారు పోసాని. ''2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి పవన్ కళ్యాణ్ కూడా కారణం కాబట్టి ఆయన్ను నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు.. అప్పుడు తన వెంటే స్టేజీపై కూర్చోబెట్టుకున్నారు. పవన్ గురించి మంచి మాటలు చెబుతూ ఆకాశానికెత్తారు. ఆ సమయంలో అక్కడే జనాల్లో హరికృష్ణ గారు, ఎన్టీఆర్ కూర్చున్నారు. అయితే ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో విడిగా వచ్చి నారా లోకేష్, తెలుగుదేశం నాయకులు చేసిన అవినీతి గురించి మాట్లాడినప్పుడు టీడీపీ వాళ్లంతా ఆయనపై సీరియస్ అయ్యారు. అంటే చంద్రబాబును పొగిడితేనే అక్కడ స్థానం. ఇకపోతే గతంలో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళితే జనం భారీగా వచ్చారు. తాతలా వాగ్ధాటి ఉన్నవాడు, జనాన్ని రప్పించగల సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికల్లో తెలివిగా వాడుకున్నాడు చంద్రబాబు. అప్పుడు అవసరమైన జూనియర్ ఎన్టీఆర్‌ను ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు పార్టీ పరిస్థితి బాగోలేకపోవడంతో మళ్లీ ఎన్టీఆర్ వైపు చూస్తున్నాడు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ హీరో కాకముందు అతన్ని అనాథలా చూసిన వీళ్లు.. ఇప్పడాయన టాప్ హీరో అయ్యాడు కాబట్టి మళ్లీ వెంటపడుతున్నారు. కాబట్టి ఎన్టీఆర్‌కు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రాడు'' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పోసాని కృష్ణమురళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eohFzs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...