దేశవిదేశాల్లో విజృంభణ కొనసాగిస్తున్న మహమ్మారి బచ్చన్ ఫ్యామిలీని తాకిన సంగతి తెలిసిందే. సహా ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో వారు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. అయితే గత 12 రోజుల నుండి Covid -19 చికిత్స పొందుతన్న అమితాబ్ బచ్చన్కి తాజాగా రిపోర్ట్లో కరోనా నెగెటివ్ అని వచ్చినట్లు ప్రముఖ న్యూస్ చానల్స్లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చూసిన అమితాబ్ బచ్చన్.. వెంటనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. అవన్నీ ఫేక్ వార్తలంటూ ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ క్లారిటీ ఇచ్చారు బిగ్ బీ. దీంతో అమితాబ్ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ప్రజల్లో సందేహాలు తలెత్తకుండా సమయస్పూర్తితో వెంటనే స్పందించిన అమితాబ్ మేనరిజం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. జులై 12వ తేదీన తమకు కరోనా వైరస్ సోకిందని పేర్కొంటూ ఆరోగ్య పరిస్థితిపై అభిషేక్ బచ్చన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. అందులో తన తండ్రి అమితాబ్కి, తనకు కోవిడ్ పాజిటివ్గా తేలిందని, తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఆసుపత్రిలో చేరామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ముంబై లోని నానావతి ఆసుపత్రిలో Covid -19 చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30xYD0E
v
No comments:
Post a Comment