Saturday, 9 May 2020

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. విజయ్ దేవరకొండతో భారీ డీల్! ఎంటరైన నమ్రత!!

రానున్న రోజుల్లో సూపర్ స్టార్ జోరు మరింత పెరగనుందని తెలుస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్న మహేష్ ఇకపై పూర్తిస్థాయి నిర్మాతగా మారాలని డిసైడ్ అయ్యారట. హీరోగా వెండితెరపై రాణిస్తూనే నిర్మాతగా తెరవెనుక సత్తా చాటుతూ లాభాలు గడించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి తన భార్య నమ్రత పూర్తి సహకారం అందించనుందని సమాచారం. నిజానికి ఇలాంటి వార్తలు ఎప్పటినుంచో వస్తున్నప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించి కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. GMB ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ప్రారంభించిన మహేష్- నమ్రత జోడీ ఇప్పటికే పలు సినిమాల్లో భాగం పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌పై అడివి శేష్, శోభిత దూళిపాల హీరోహీరోయిన్లుగా 'మేజర్' సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ కూడా ఫినిష్ అయింది. లాక్‌డౌన్ పూర్తికాగానే మిగిలిన కొంతభాగం కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగానే విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమాను నిర్మించాలని మహేష్ బాబు ఫిక్స్ అయ్యారట. Also Read: ఈ మేరకు ఈ లాక్‌డౌన్ సమయంలో విజయ్‌తో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్ మహేష్ సతీమణి నమ్రత సెట్ చేసిందని ఫిలింనగర్ టాక్. సర్వ హంగులతో భారీ రేంజ్‌లో ఈ మూవీ ఉండనుందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు అఫీషియల్‌గా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా ఉంటుందని విన్నాం. సో.. చూడాలి మరి మహేష్ బాబు బ్యానర్ నుంచి ఎలాంటి బిగ్ న్యూస్ బయటకొస్తుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WLtNzM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...