Saturday, 16 May 2020

చిరంజీవి కోసం రాజాకార్ల కథ.. మెగాస్టార్ తదుపరి ప్రాజెక్ట్స్‌పై లేటెస్ట్ అప్‌డేట్

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘సైరా నరసింహా రెడ్డి’తో అట్రాక్ట్ చేశారు. రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కానప్పటికీ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా హావభావాలు, అభినయం మెగా అభిమానుల్లో నూతనోత్సవాహం నింపాయి. ఈ క్రమంలో ఆయనతో అదే పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేసేందుకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారట. మాస్ డైరెక్టర్ చిరంజీవి కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో ‘రచ్చ’ చేసి మెగా ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు చిరంజీవి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారట. మెగాస్టార్ కోసం రజాకార్ల నేపథ్యంలో సాగే మాస్ మసాలా కథను రెడీ చేసి పెట్టుకున్నారట సంపత్ నంది. అప్పట్లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా స్టోరీ లైన్ డెవలప్ చేసి మంచి స్క్రిప్ట్ రూపొందించారట. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ఆ కథను చిరంజీవికి వినిపించి ఓకే చేయించుకోవాలని ఆయన చూస్తున్నారట. ప్రస్తుతం గోపీచంద్‌తో 'సీటీమార్' సినిమా చేస్తున్న సంపత్ నంది ఆ వెంటనే చిరంజీవి సినిమానే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టాక్. Also Read: మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. తన తదుపరి సినిమాలను సుజీత్, బాబీ దర్శకత్వంలో చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి కోసం ‘లూసిఫర్’ రీమేక్‌పై కసరత్తులు చేస్తున్నారు సుజీత్. ‘ఆచార్య’ ఫినిష్ కాగానే ఈ సినిమానే సెట్స్ మీదకు రానుందని సమాచారం. ఆ తర్వాత బాబీ డైరెక్షన్‌లో మూవీ ఉంటుంది. సో.. సంపత్ నంది సిద్ధం చేసిన రజాకార్ల కథకు ముహూర్తం రావాలంటే ఇంకా చాలా సమయమే పట్టొచ్చు!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cAUXQE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...