Monday, 18 May 2020

జీతాలు ఇవ్వడం లేదు.. ప్రభుత్వమే ఆదుకోవాలి: సినిమా థియేటర్ కార్మికుల డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్స్‌లో పనిచేసే కార్మికులకు లాక్‌డౌన్ కాలంలో పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి.వెంకటేష్, పాలడుగు భాస్కర్ ప్రారంభించారు. కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం.. కార్మికులందరికీ లాక్‌డౌన్ కాలానికి పూర్తి జీతం ఇవ్వాలని జీవో నెంబర్ 45 తీసుకొచ్చిందని వారు అన్నారు. కానీ, సినిమా థియేటర్ యజమానులు థియేటర్‌లో పనిచేసే కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను లెక్కచేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నా యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని కొన్ని థియేటర్స్‌లో లాక్‌డోన్ పేరుతో కార్మికులను పనిలో నుంచి తొలగిస్తున్నారని, వారికి ఇచ్చే వేతనంలో 40 నుంచి 50 శాతం కోతలు విధిస్తున్నారని వెల్లడించారు. Also Read: లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో సినిమా థియేటర్‌లో పనిచేసే 20వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకులు, రూ.7,500 అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మారన్న, రాష్ట్ర కార్యదర్శులు పి. పుల్లారావు, కె. అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. సత్తయ్య, నాయకులు సుధాకర్, సురేష్, ఐనాక్స్ రాజు, కోటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36aaILX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...