ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మెగా పవర్స్టార్ హవా నడుస్తోంది. ఇటీవలే 'రంగస్థలం' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకొని రికార్డులను తిరగరాసిన ఆయన.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో (రణం రౌద్రం రుధిరం) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఫినిష్ కానుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? ఏ డైరెక్టర్తో ఆయన మూవీ ఉండనుంది అనే దానిపై కన్నేశారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, కొరటాల శివ, విక్రమ్ కె కుమార్ లాంటి దర్శకులతో రామ్ చరణ్ తదుపరి సినిమా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఫిలింనగర్ నుంచి అందిన తాజా సమాచారం మేరకు చెర్రీ.. తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ఇచ్చారట. భారీ స్కెచ్ వేసిన సురేందర్ రెడ్డి.. తన వద్ద ఉన్న కథను చెర్రీకి వివరించారట. ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్.. RRR షూటింగ్ పూర్తికాగానే ఈ సినిమా చేసేద్దామని మాటిచ్చారట. అంటే రీసెంట్గా తండ్రి చిరంజీవిని డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి.. ఇక కొడుకు రామ్ చరణ్తో మ్యాజిక్ చేయనున్నారన్నమాట. గతంలో దర్శకత్వంలో 'దృవ' మూవీ చేశారు రామ్ చరణ్. Also Read: మెగాస్టార్ తనయుడిగా సినీ గడపతొక్కిన రామ్ చరణ్.. అద్భుతమైన టాలెంట్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా వెలుతూ ఇండస్ట్రీ హిట్స్ సాధించారు. సినిమా సినిమాకు యాక్టింగ్లో వేరియేషన్స్ చూపిస్తూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా కూడా మారి సత్తా చాటుతున్నారు. ఇకపోతే చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ నటించనుండటం మెగా అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. ఏదేమైనా చెర్రీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తాలూకు సంగతులు ఆయన అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TisOX0
v
No comments:
Post a Comment