Tuesday, 19 May 2020

నాకింకా 19 ఏళ్లే.. అందరూ అలా అంటుంటే బాధేస్తోంది: శ్రీదేవి కూతురు ఆవేదన

స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి చిన్న కూతురు చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తనపై వస్తున్న కామెంట్స్, విమర్శలు చూసి చాలా బాధేస్తోందని ఆవేదన చెందింది తీవ్ర ఖుషీ కపూర్. ఈ మేరకు ‘క్వారంటైన్ టేప్స్’ పేరిట ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఒకింత భావోద్వేగానికి లోనైంది ఖుషీ కపూర్. తానింకా 19 ఏళ్ల అమ్మాయినేనని, ఇంకా ఎదుగుదల దశలో ఉన్నానని అంటోంది ఖుషీ కపూర్. తనకు ఎలాంటి అర్హత లేకపోయినా కొందరు చాలా ప్రేమ కురిపిస్తున్నారని, తానింకా ఏమీ సాధించలేదని, ప్రజలను సంతోష పరిచే శక్తి వంతురాలిగా మారినపుడే ఆ ప్రశంసలకు ఓ అర్థముంటుందని ఆమె పేర్కొంది. మరోవైపు కొందరు మాత్రం తనను అకారణంగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుండటం ఇబ్బందిగా అనిపిస్తోందని ఆమె తెలిపింది. Also Read: తనను అమ్మతో, అక్కతో పోల్చుతూ వాళ్ళలా అందంగా లేవని అంటుండటం, తన అందం విషయమై జోక్‌లు వేస్తుండటం చూస్తుంటే చాలా బాధగా ఉందని ఖుషీ తెలిపింది. తాను కూడా అందరిలాంటి అమ్మాయినే అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఉందని ఆమె పేర్కొంది. తనపై వస్తోన్న ఇటువంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా లేదని చెప్పింది. కాకపోతే ముందు మనల్ని మనం ఇష్టపడితే.. ప్రజలు ఆటోమేటిక్‌గా ఇష్టపడతారనే విషయం మాత్రం తెలిసిందని ఆమె వెల్లడించింది. మరోవైపు శ్రీదేవి వారసురాలిగా తెరంగేట్రం చేసిన ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ తొలి సినిమా 'ధడక్' తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటనలో, అందంలో శ్రీదేవిని తలపిస్తోందని ప్రశంసలందుకుంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడి అందాలకు మాంచి గిరాకీ ఉంటుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e2Mu9p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...